"వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధం"
By - Vijayanand |26 May 2023 10:25 AM GMT
చంద్రబాబు ముఖ్యమంత్రిగా వస్తేనే రాష్ట్రం మళ్లీ బాగుపడుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. మహానాడు తర్వాత ఎన్నికల వరకు అధినేత చంద్రబాబుతో సహా ప్రతి ఒక్కరూ ప్రజాక్షేత్రంలోనే ఉంటామని చెప్పారు. మహానాడులో చంద్రబాబు సరికొత్త కార్యక్రమాన్ని ప్రకటించబోతున్నారని తెలిపారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలుస్తామన్నారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వస్తేనే రాష్ట్రం మళ్లీ బాగుపడుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com