కరోనాతో మృతి చెందిన వారికి పవన్ కళ్యాణ్ నివాళులు..!

కరోనాతో మృతి చెందిన వారికి పవన్ కళ్యాణ్ నివాళులు..!
Pawan Kalyan : కరోనా కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేసారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

Pawan Kalyan : కరోనా కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేసారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో కరోనాతో మృతి చెందిన వారికి నాదేండ్ల మనోహర్‌తో కలిసి ఆయన నివాళులర్పించారు. అనంతరం నంద్యాలలో చనిపోయిన జనసేన కార్యకర్త సోమేష్ కుటుంబసభ్యులకు ఐద లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. లక్ష మంది పార్టీ కార్యకర్తలకు జనసేన తరుపున బీమా సౌకర్యం కల్పించామని పవన్ తెలిపారు. తన వంతుగా బీమా పథకానికి కోటి రూపాయల విరాళం అందిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పార్టీ కృషి చేస్తుందన్న పవన్ కళ్యాణ్.. ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుందని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story