PAWAN: ప్రజా గొంతుకు 42 ఏళ్ళు: పవన్

తెలుగుదేశ పార్టీ ఆవిర్భవించి నేటికి 42 ఏళ్లు పూర్తి అవ్వడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘1982 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా మాజీ ముఖ్యమంత్రి కీ. శే నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ.. జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన టీడీపీ ప్రజల పక్షాన నిలిచిందని కొనియాడారు. రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన టీడీపీ నేడు 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు ముందు టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకొని.. కేంద్రంలోని ఎన్డియే ప్రభుత్వంతో కలిపి రాష్ట్రంలో భారీ విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
చంద్రబాబు భావోద్వేగ పోస్ట్
మాజీ ముఖ్యమంత్రి కీ. శే శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సిన విషయం తెలిసిందే.అన్న నందమూరి తారక రామారావు గారిచే స్థాపించబడిన.. ఆంధ్రుల ఆత్మగౌరవ పతాక.. తెలుగుజాతి కీర్తిని ప్రపంచానికి చాటిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా.. తెలుగు ప్రజలకు, తెలుగుదేశం పార్టీనీ నాలుగు దశాబ్దాలుగా తమ భుజస్కంధాల మీద మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు, కుటుంబ సభ్యులకు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నేళ్లు దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే.. అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణం, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం చంద్రబాబు అన్నారు.తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు.. ఆ తరువాత అని ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి ఉందని చంద్రబాబు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com