Kurnool: కర్నూలులో కొత్త స్కామ్.. ప్రజల అకౌంట్లలో ప్రభుత్వ పథకాల డబ్బు మాయం..

Kurnool: కర్నూలులో కొత్త స్కామ్.. ప్రజల అకౌంట్లలో ప్రభుత్వ పథకాల డబ్బు మాయం..
Kurnool: కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రభుత్వ నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది.

Kurnool: కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రభుత్వ నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రజల అకౌంట్లలో ప్రభుత్వ పథకాల డబ్బులు పడకపోయినా.. పడినట్లు ప్రచార పత్రాలు ముద్రించారు. దీంతో దిబ్బనకల్‌లో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని నిలదీశారు. తమ అకౌంట్‌లో చేయూత డబ్బులు జమకాలేదని వెంకటేశ్వర్లు, పద్మావతి తెలిపారు. ఎమ్మెల్యేకు బుక్‌ చూపించి నిలదీశారు. నగదు జమ కాకపోయినా వేసినట్లు తప్పుగా ప్రచార పత్రాలు ముద్రించారని అన్నారు. ఖంగుతిన్న ఎమ్మెల్యే సమాధానం చెప్పలేక అక్కడి నుంచి జారుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story