తిరుపతిలో ఏపీ మంత్రులకు చేదు అనుభవం..!
By - TV5 Digital Team |23 Nov 2021 12:45 PM GMT
తిరుపతిలో మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, నారాయణస్వామిని అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు, వరద బాధితులు. సర్వం కోల్పొయి రోడ్డున పడ్డా పట్టించుకోరా అని ప్రశ్నించారు.
తిరుపతిలో మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, నారాయణస్వామిని అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు, వరద బాధితులు. సర్వం కోల్పొయి రోడ్డున పడ్డా పట్టించుకోరా అని ప్రశ్నించారు. చనిపోయాక నష్ట పరిహారం ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు, బాధితుల ప్రశ్నలతో మంత్రులు సైలెంట్ అయ్యారు. పార్టీనే నమ్ముకున్న తమకు కూడా నమ్మకం పోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాయల చెరువు లీకేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com