perni nani : మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్

Perni Nani : తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. పైసల్లేక ఆంధ్రావాళ్లు అడుక్కు తింటున్నారన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అడుక్కుతింటామని ఆరోజు ఆంధ్రా వాళ్లు హేళన చేశారని.. కానీ, ఈరోజు జగన్ బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ రెడ్డి.. ఆంధ్రా సీఎం జగన్ నిధులు లేక కేంద్రం దగ్గర అడుక్కుంటున్నారన్నారు. ఐతే.. తాము బిచ్చమెత్తుకునేందుకే వెళ్తే.. కేసీఆర్ పదేపదే ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. కేంద్రంలో చేరతా..కేంద్ర మంత్రి పదవులివ్వండని అడుగుతున్నారా? అన్నారు. బయట కాలర్ ఎగరేసి... లోపలికెళ్లి కాళ్లు మొక్కడం తమకు చేతకాదంటూ పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com