AP High Court : ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఫిటిషన్..!

AP High Court : ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఫిటిషన్..!
AP High Court : ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ రేగు మహేష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

AP High Court : ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ రేగు మహేష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నీలం సాహ్నీని నియమించారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన ఏపీ హైకోర్టు.. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమ్మర్ వేకేషన్ తర్వాత ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టనున్నట్టు పేర్కొంది. అటు ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవికాలం ముగియడంతో.. నీలం సాహ్ని పేరును ప్రభుత్వం గ‌వ‌ర్నర్‌కు సిఫార‌సు చేయ‌డంతో గవర్నర్ ఆమోదం తెలిపారు. అంతకుముందు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శిగా నీలం సాహ్నీ పనిచేశారు.


Tags

Read MoreRead Less
Next Story