Konaseema: చంద్రబాబు పర్యటనలో దొంగల చేతివాటం.. మాజీమంత్రి పర్స్ చోరీ..

Konaseema: చంద్రబాబు పర్యటనలో దొంగల చేతివాటం.. మాజీమంత్రి పర్స్ చోరీ..
Konaseema: అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో దొంగల చేతివాటం చూపించారు. రాజోలులో వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు.

Konaseema: అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో దొంగల చేతివాటం చూపించారు. రాజోలులో వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా భారీగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. ఇదే అదునుగా భావించిన దొంగలు రెచ్చిపోయారు. మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు పర్స్‌ కొట్టేశారు. అందులో 35వేల నగదు, 17వేల విదేశీ కరెన్సీ, రెండు ఏటీఎం కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాజోలు పీఎస్‌లో సూర్యారావు ఫిర్యాదు చేశారు.మరో 20 మంది పర్సులు కూడా చోరీకి గురైనట్లు తెలుస్తోంది. వీటితో పాటు పలువురి కార్యకర్తలు, అభిమానుల సెల్‌ఫోన్లు కూడా చోరీకి గురయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story