Anantapuram Paritala : బటన్ నొక్కుడు సీఎంగా మారిపోయారు : పరిటాల శ్రీరాం

Anantapuram Paritala : జగన్ సర్కారు మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాళ్లు వేస్తోందని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అన్నారు. అనంతపురంలో చలో గొందిరెడ్డిపల్లి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. కేవలం రైతుల సమస్యలను తెలుసుకునేందుకు గొందిరెడ్డిపల్లిలో ముఖాముఖీ ఏర్పాటు చేశామన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేపడితే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. గొందిరెడ్డిపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. జగన్ కేవలం బటన్ నొక్కుడు సీఎంగా మారిపోయారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే రైతులు, ఉద్యోగులు, యువతకు న్యాయం జరుగుతుందని ప్రజలు చెప్తున్నారని పరిటాల శ్రీరామ్ తెలిపారు.
అంతకుముందు రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు పరిటాల శ్రీరామ్ చేపట్టిన చలో గొందిరెడ్డిపల్లి కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఇంటి నుంచి బయల్దేరిన పరిటాల శ్రీరామ్ను.. బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రోడ్డుపైనే బైఠాయించి పరిటాల శ్రీరామ్ నిరసన తెలిపారు. అటు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు, రైతులు.. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com