Palnadu : రంగా విగ్రహం ధ్వంసం.. పల్నాడులో ఉద్రిక్తత

Palnadu : రంగా విగ్రహం ధ్వంసం.. పల్నాడులో ఉద్రిక్తత
X

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం వేమవరంలో మోహన రంగ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా పలనాడు జిల్లాలో అనేక హింసాత్మక ఘటన చోటు చేసుకున్నాయి. ఆ మంటలు ఆరక ముందే తాజాగా ఘటన పెను దుమారం రేపుతోంది. ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు కొందరు మోహన రంగ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రంగా అభిమానులు డిమాండ్ చేశారు.

Tags

Next Story