Palnadu : రంగా విగ్రహం ధ్వంసం.. పల్నాడులో ఉద్రిక్తత

X
By - Manikanta |29 Oct 2024 7:15 PM IST
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం వేమవరంలో మోహన రంగ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా పలనాడు జిల్లాలో అనేక హింసాత్మక ఘటన చోటు చేసుకున్నాయి. ఆ మంటలు ఆరక ముందే తాజాగా ఘటన పెను దుమారం రేపుతోంది. ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు కొందరు మోహన రంగ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రంగా అభిమానులు డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com