పిల్లలూ బడికెళ్లాలి బ్యాగు సర్ధండి.. ఆగస్ట్ 16 నుంచి..
By - Gunnesh UV |29 July 2021 10:32 AM GMT
ఎట్టకేలకు బడి గంట మోగనుంది. కరోనా భయంతో మూతపడ్డ కళాశాలలు, పాఠశాలలు పిల్లలతో సందడి చేయడానికి సంసిద్ధమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు బడి బాట పట్టే సమయం ఆసన్నమైంది. ఎట్టకేలకు బడి గంట మోగనుంది. కరోనా భయంతో మూతపడ్డ కళాశాలలు, పాఠశాలలు పిల్లలతో సందడి చేయడానికి సమాయత్తమవుతున్నాయి. ఆగస్ట్ 16 నుంచి పాఠశాలలు పున:ప్రారంభిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
ఈలోగా ఉపాధ్యాయులందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని మంత్రి తెలిపారు. రెండో విడత విద్యా కానుక అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. నాడు-నేడు పనులు 90-98 శాతం పూర్తయ్యాయని, ఆగస్ట్ 16న నాడు-నేడు ఫేజ్-2తో.. బడి రూపు రేఖలు మార్చేలా కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు.
అమ్మ ఒడి, వసతి దీవెన వద్దనుకుంటున్న వారికి వచ్చే ఏడాది నుంచి ల్యాప్టాప్లు అందిస్తామని మంత్రి సురేష్ పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com