Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు మృతి.. అందులో ఏడాది చిన్నారి..

X
By - Divya Reddy |5 Dec 2021 5:15 PM IST
Tirupati: తిరుపతి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Tirupati: తిరుపతి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉంది. డివైడర్ను ఢీకొట్టిన్న సమయంలో కారులో మంటలు చెలరేగాయి. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వాసులుగా గుర్తించారు. కాణిపాకం వినాయకుడిని దర్శించుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com