Shivaratri 2023 : పట్టిసీమలో శివరాత్రి ఉత్సవాలు

ఆధ్యాత్మికతను నెలవు పట్టిసీమ వీరభద్రస్వామి దేవస్థానం…ఇక్కడ వెలిసిన వెలసిన వీరభద్రస్వామి ఆలయం విశిష్ట స్థానం సంపాదించుకుంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఐదు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు.
దక్షయాగంలో సతీదేవి అగ్నికి ఆహుతికాగా, రౌదమ్రూర్తియైన పరమశివుడు తన శిరస్సునుండి ఒక జటాజూటాన్ని పెరికి నేలకు వేసి కొట్టగా అందులోనుండి వీరభద్రుడు ఆవిర్భవించిచాడు. అప్పుడు… దక్షుని యాగాన్ని ధ్వంసం చేయమని శివుడు ఆనతీయగా వీరభద్రుడు ప్రమధ గణాలతో హుటాహుటిన దక్షుని యాగ శాలకు వెళ్ళి యఙ్ఞకుండమును ధ్వంసముచేసి అడ్డువచ్చినవారిని సంహరిస్తూ దక్షుని శిరస్సు ఖండించాడు. ఆ రౌద్రమూర్తి దేవకూట పర్వతముపై ప్రళయ తాండవం చేస్తుండగా… అతని చేతిలోని పట్టిసం అనే కత్తి జారి దేవకూట పర్వతముపై పడిందట అంతటి మహిమాన్విత క్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com