Kakinada: కాకినాడలో ఎస్సై సూసైడ్.. షాక్లో భార్యా పిల్లలు..

X
Kakinada: కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై గోపాల కృష్ణ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. రాత్రి తన నివాసంలోనే ఆయన గన్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. 2014 బ్యాచ్కు చెందిన గోపాలకృష్ణ.. స్వస్థలం విజయవాడ జగ్గయ్య చెరువు. ఆయనగు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాత్రి భార్యాపిల్లలు బెడ్రూమ్లో నిద్రిస్తున్నప్పుడు.. హాల్లోకి వచ్చి ఎస్సై సూసైడ్ చేసుకున్నారు. గన్తో కాల్చుకుని చచ్చిపోయేంతటి కారణం ఏమైఉంటుంది, ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
