విజయవాడ నడిబొడ్డన సీతమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

X
By - Nagesh Swarna |3 Jan 2021 11:36 AM IST
మొన్న రామతీర్థంలో రామయ్య విగ్రహం ధ్వంసం జరిగితే.. ఇవాళ విజయవాడ నడిబొడ్డన సీతమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
ఏపీలో దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. సర్కార్ నిర్లప్తతతో దుండగులు మరింత బరితెగిస్తున్నారు. మొన్న రామతీర్థంలో రామయ్య విగ్రహం ధ్వంసం జరిగితే.. ఇవాళ విజయవాడ నడిబొడ్డన సీతమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఉన్న..శ్రీసీతారామ మందిరంపై దాడికి పాల్పడ్డారు. దేవాలయానికి తాళం వేసి ఉన్నా.. కొబ్బరి బోండాలతో విగ్రహాలను కొట్టారు. ఈ దాడిలో సీతాదేవి విగ్రహం ధ్వంసమైంది. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com