YSRCP Leader Murder Case : వైసీపీ నేత రషీద్ హత్య కేసులో ఆరుగురి ఆరెస్ట్

YSRCP Leader Murder Case : వైసీపీ నేత రషీద్ హత్య కేసులో ఆరుగురి ఆరెస్ట్
X

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన షేక్ రషీద్ హత్య కేసులో వినుకొండ పోలీసులు గురువారం అరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ సి. సాంబశివరావు వివరాలు వెల్లడించారు.

ఈనెల 17వ తేదీ తొలి ఏకాదశి పండుగ రోజు పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ సెంటర్లో సాయంత్రం 8 గంటల సమయంలో వినుకొండ పట్టణంలోని పెద్ద మసీదు బజారుకు చెందిన షేక్ రషీద్ ను అదే బజారుకు చెందిన షేక్ జిలాని అలియాస్ జాని స్థానిక ముళ్ళమూరు బస్టాండులో కత్తితో నరికి హత్య చేశాడని, నిందితుడిని అదుపులోకి తీసుకొని ఈనెల 18వ తేదీన అరెస్టు చేసి రిమాండుకు పంపించినట్లు సీఐ తెలిపారు. రషీద్ హత్యలో జిలాని తోపాటు మరో ఆరుగురి ప్రమేయం ఉందని గుర్తించామన్నారు. నరసరావుపేట పట్టణంలోని బరం పేటకు పఠాన్ అబు బరక్ సిద్ధిక్ ఎలియాస్ సిద్దు, వినుకొండ పట్టణం సీతయ్య నగర్ కు చెందిన కొమ్ము వెంకట సాయి, కొమ్ము ఏడుకొండలు, బైలబోయిన అనిల్, షేక్ రోహిత్ ఎలియాస్ సోహెల్ ప్రకాశం జిల్లా పంగులూరు మండలం తక్కెళ్ళ పాడు గ్రామానికి చెందిన పలపార్తి సుమంత్లను అరెస్టు చేసి రిమాండుకు పంపామని సిఐ సాంబశివ రావు తెలిపారు.

ఈ హత్య కేసులో ఎలాంటి రాజకీయ కోణం లేదని మృతుడు షేక్ రషీద్ అతనిని హత్య చేసిన షేక్ జిలానికి వీరిద్దరికి వ్యక్తి గత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని సీఐ అన్నారు. విచారణ కొనసాగుతుందని ఈ హత్యలో ఎవరి ప్రమేయం ఉన్నా వారందరిని కటకటాల్లోకి పంపిస్తామని.. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అరెస్ట్ చేసిన నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నామని తెలిపారు.

Tags

Next Story