Minister Lokesh : సెప్టెంబర్లో నైపుణ్యం పోర్టల్ ప్రారంభం

నైపుణ్యం పోర్టల్పై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సెప్టెంబర్లో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. అధికారులతో ఉండవల్లిలోని నివాసంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. దీనికి సంబంధించి లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. ‘‘ఉద్యోగ, ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో నైపుణ్యం పోర్టల్ను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 90 రోజులపాటు ఈ కార్యక్రమం చేపడతాం. ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రెజ్యూమ్ సిద్ధమయ్యేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించాను. ఇటీవల ఢిల్లీ పర్యటన అనంతరం ఐటీఐల అభివృద్ధికి హబ్ అండ్ స్పోక్ విధానంలో కేంద్రం కార్యక్రమం ద్వారా రూ.600 కోట్లు కేటాయించాం’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com