SomiReddy: కాకాణికి కోర్టు దొంగతనాలపై ఉన్న శ్రద్ధ వ్యవసాయంపై లేదు

X
By - Subba Reddy |9 Feb 2023 3:45 PM IST
రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతబడిపోయిందని సోమిరెడ్డి ఆరోపించారు
మంత్రి కాకాణికి కోర్టు దొంగతనాలపై ఉన్న శ్రద్ధ వ్యవసాయంపై లేదన్నారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తెలంగాణలో ముఖ్యమంత్రి ఏది చెబితే అదే జరుగుతుందని కానీ ఏపీలో అలా జరగడంలేదని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతబడిపోయిందని సోమిరెడ్డి ఆరోపించారు. అధికార పార్టీ నేతలు ఒకరి బండారాలను మరొకరు బయటపెట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేసేందుకు టీడీపీలోకి రావాలనుకుంటే జిల్లా, రాష్ట్ర నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటామని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com