ఏపీలో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: సోమిరెడ్డి
By - TV5 Digital Team |26 April 2021 7:30 AM GMT
కరోనా రెండో దశ ప్రమాదకరంగా మారనుందని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడెందుకు ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు
ఎన్నికల నిర్వహణ సమయంలో కరోనా రెండో దశ ప్రమాదకరంగా మారనుందని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడెందుకు ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మండిపడ్డారు. కోవిడ్ బారిన పడి అంబులెన్సుల్లో రోడ్లపైనే ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రికి కన్పించడం లేదా అని ప్రశ్నించారు. తొలిదశ కరోనా సమయంలో తీసుకున్న కొద్దిపాటి చర్యలు కూడా ఇప్పుడు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com