Sugali Preethi: సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసులో మరో ట్విస్ట్..

Sugali Preethi: సంచలనం రేపిన కర్నూలు విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది.ఈ కేసులో నాగిరెడ్డి అనే నిందితుడిని తెరమీదకు తెచ్చిన పోలీసులు.. కేసును క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. 2017లో కర్నూలు శివారులోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంతవరకు పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు.
బలమైన సాక్ష్యాలు చెదిరిపోయినట్లు విమర్శలు వచ్చాయి. ఆ స్కూల్కు సంబంధించిన పెద్దలే తన కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని తల్లి, మహిళా సంఘాలు ఆరోపిస్తూ నిరసనలు చేస్తూనే ఉన్నారు. న్యాయం చేస్తామన్న జగన్ ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించి ఐదు సెంట్ల స్థలం కేటాయించి చేతులు దులుపుకుంది. కానీ బాధితులకు మాత్రం న్యాయం జరగలేదు.
తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నాగిరెడ్డి అనే వ్యక్తి తెరమీదకు వచ్చాడు. పోలీసులు అతన్ని బెదిరించి హింసించి తానే అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా నేరం అంగీకరించేలా చేశారని మృతురాలి తల్లి పార్వతీబాయి ఆరోపిస్తున్నారు. నాగిరెడ్డిని పోలీసులు బలిపశువును చేస్తున్నారన్నారు. పోలీసులే బలవంత పెట్టి చెప్పించి వీడియో రికార్డ్ చేశారని నాగిరెడ్డి ఆరోపిస్తున్నాడు. దీనిపై పోలీసుల నుంచి స్పష్టత లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com