AP: అనంతపురంలో టీడీపీ కలెక్టరేట్ కార్యక్రమం
By - Vijayanand |7 July 2023 12:13 PM GMT
అనంతపురంలో టీడీపీ నాయకులు చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ జిల్లా పర్యటన సందర్భంగా తెలుగుదేశం నాయకులు నిరసన తెలిపారు. రైతులకు పంట నష్ట పరిహారం అందించే విషయంలో వైసీపీ ప్రభుత్వం జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ ఆరోపించింది. ప్రభుత్వం ఇస్తున్న పరిహారం పంటలో కలుపు తీయడానికి కూడా సరిపోదని మండిపడింది. సీఎం జగన్కు అనంత జిల్లాకు వచ్చే అర్హత లేదన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోకుండా రైతు దినోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. పంటలు పండే భూములను చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం గుర్తుకొస్తుందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com