Chandrababu : ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

Chandrababu : ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
Chandrababu : ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్‌ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

Chandrababu : ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్‌ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైమ్‌ రేట్‌పై లేఖ రాశారు. నేరాలను అదుపు చేయడంలో పోలీసుల విఫలమయ్యారన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నం అయిందన్నారు చంద్రబాబు. జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందని విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా పరిస్థితులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.

పెట్రేగుతున్న వైసీపీ గూండాలను అదుపు చేయడంలో పోలీసు శాఖ విఫలం అవుతుందని విమర్శించారు. జి.కొత్తపల్లిలో తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కారణం అని స్వయంగా మృతుడు గంజి ప్రసాద్ భార్య చెప్పారన్నారు. అటు.. శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసుల విఫలమయ్యారన్నారు.

లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగేది కాదన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో హింసకు, నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం కారణం అవుతున్నాయని అన్నారు. గంజాయి సరఫరాలో వైసీపీ నేతల ప్రమేయం కనిపిస్తున్నా.. పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. అనంతపురంలో పెన్షన్ అడిగిన పాపానికి పోలీసు అధికారి టీడీపీ కార్యకర్తపై దాడి చేయడం డిపార్ట్‌మెంట్‌లో పరిస్థితికి అద్దం పడుతుందన్నారు.

రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పట్టపగలు గన్‌తో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోటలో బ్యాంక్ దోపిడీ జరిగిందన్నారు చంద్రబాబు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ పోలీసులు స్పందించకున్నా.. కర్నాటక పోలీసులు వైసీపీ ఎంపీటీసీని అరెస్ట్‌ చేశారన్నారు. తాజాగా ఏపీ నుంచి అస్ట్రేలియాకు డగ్స్ వెళ్లిన కేసులో దర్యాప్తు సంస్థలు ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాయని అన్నారు. నేరాల్లో నిందుతులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.. లా అండ్ ఆర్డర్ అమలుపై పోలీసు శాఖ దృష్టి పెట్టాలన్నారు. వివిధ అంశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, ఇతర వీడియోలు లేఖకు జత చేశారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story