ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
గుంటూరు జిల్లా కొప్పర్రు ఘటనపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

గుంటూరు జిల్లా కొప్పర్రు ఘటనపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఘటన జరిగిన రోజు రాత్రి 10.30 నుంచి 12.30 గంటల మధ్య ఏ నిమిషంలో ఏం జరిగిందో వివరిస్తూ లేఖ రాశారు. ఘటనకు సంబంధించిన ఫోటోలను లేఖతోపాటు జత చేశారు. ఇంటి దహనం, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని లేఖలో కోరారు. బాధిత వర్గంగా ఉన్న 49 మంది టీడీపీ సానుభూతిపరులపై కేసు పెట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. టీడీపీ నేతలపై పెట్టిన కేసులో విద్యార్థులు, మహిళలు ఉన్నారని.. ఆ సమయంలో ఊళ్లో లేని వారి పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని మండిపడ్డారు. అధికార వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి నేరాలను ప్రోత్సహించేలా పోలీసులు వ్యవహరించడం దుర్మార్గమన్నారు చంద్రబాబు.



Tags

Read MoreRead Less
Next Story