కర్మాగారం కోసం పోరాడితే.. జగన్ రెడ్డి కారాగారానికి పోతారు: అయ్యన్నపాత్రుడు
![కర్మాగారం కోసం పోరాడితే.. జగన్ రెడ్డి కారాగారానికి పోతారు: అయ్యన్నపాత్రుడు కర్మాగారం కోసం పోరాడితే.. జగన్ రెడ్డి కారాగారానికి పోతారు: అయ్యన్నపాత్రుడు](https://www.tv5news.in/h-upload/2021/02/10/407303-ayyanapaatrdudu.webp)
X
By - TV5 Digital Team |10 Feb 2021 2:35 PM IST
కర్మాగారం ఏదో.. కారాగారం ఏదో తెలియని వ్యక్తి రాజ్యసభ సభ్యుడు అవ్వడం ఖర్మ అని మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
కర్మాగారం ఏదో.. కారాగారం ఏదో తెలియని వ్యక్తి రాజ్యసభ సభ్యుడు అవ్వడం ఖర్మ అని మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. గనులన్నీ గాలి బ్రదర్స్తో కలిసి కొట్టేసిన మీరు.. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత ఘనులు కేటాయించాలని డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. కర్మాగారం కోసం పోరాడితే.. జగన్ రెడ్డి కారాగారానికి పోతారని అందుకే సైలెంట్గా ఉన్నారన్నారు అయ్యన్నపాత్రుడు. సాయిరెడ్డి మనసులో మాట బయటపెట్టినట్టు ఉన్నాడని ట్వీట్ చేశారు. జగన్ రెడ్డి చేతుల్లో ఉన్న ఘనులు కేటాయిస్తే చాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆరు నెలల్లో లాభల్లోకి వస్తుందన్నారు అయ్యన్నపాత్రుడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com