కొత్త SEC నీలంసాహ్నిని కలిసిన టీడీపీ నేతలు

X
పరిషత్ ఎన్నికలకు ప్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ నేతలు కొత్త SEC నీలం సాహ్నిని కోరారు. గత ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ ఎలాంటి అక్రమాలకు పాల్పడిందన్నది ఆమెకి వివరించారు. MPTC, ZPTC ఎన్నికల్లో ఏకగ్రీవాలు భారీగా పెరిగిన అంశాన్ని కూడా SEC దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఏకగ్రీవాల్లో జోక్యం చేసుకోలేము అని మాత్రమే చెప్పిందని..SEC వాటిని రివ్యూ చేయవచ్చని టీడీపీ నేతలు తెలిపారు. ప్రెష్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే అది మరో డ్రామాగా నిలిచిపోతుందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
