MAHANADU: పసుపు మయమైన కడప గడప

MAHANADU: పసుపు మయమైన కడప గడప
X
కడప మొత్తం పసుపు తోరణాలు, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు

రాయలసీమ నడిబొడ్డున కడప వేదికగా టీడీపీ మహానాడుకు సిద్ధమైంది. దీంతో కడప మొత్తం పసుపు తోరణాలు, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సంబంధించిన టీడీపీ స్పెషల్ సాంగ్ విడుదల చేసింది. తెలుగు తమ్ముళ్లను ఆహ్వానిస్తూ.. పదరా సోదరా అంటూ ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. మూడు రోజుల పాటు సాగే మహానాడు పండుగకు 40 వేలకు మందికిగా పైగా టీడీపీ శ్రేణులు వస్తారని పార్టీ అంచనా వేస్తోంది.

ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి సుభాష్

మహానాడు ఏర్పాట్లలో మంత్రి సుభాష్ గత కొన్ని రోజులుగా నిమగ్నమయ్యారు అని రామచంద్రపురం మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపారు. మంత్రి సుభాష్‌ను డెకరేషన్, శానిటేషన్ కమిటీ కన్వీనర్‌గా నియమించిన నేపథ్యంలో మహానాడు ప్రధానవేదిక, ఫోటో గ్యాలరీ, స్వాగత ద్వారాలను కమిటీ సభ్యులతో కలసి చర్చించి పర్యవేక్షిస్తున్నారని వారు తెలిపారు.

మహానాడుకు తరలి రండి: మంత్రి సవిత

తెలుగుదేశం పార్టీ మహానాడును విజయవంతం చేయండని మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కడపలో ఈనెల 27, 28, 29వ తేదీలలో జరిగే మహానాడును విజయవంతం చేయాలని, నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

మహానాడుకి 10. లక్షల చెక్కునందించిన: వర్మ

కడపలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడు 2025 కి బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ 10. లక్షలు రూపాయలు విరాలాన్ని చెక్కు రూపంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ కి, అందచేశారు. ఈ సందర్బంగా నరేంద్ర వర్ మ మాట్లాడుతూ అధికారం లోకి వచ్చిన తర్వాత జరిగే మొట్ట మొదటి మహానాడు ని తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. కార్యకర్తలు తరలిరావాలని వర్మ అన్నారు.

మహానాడుకు తరలివెళ్ళిన టీడీపీ శ్రేణులు

కడపలో రేపటి నుండి జరగనున్న టీడీపీ మహానాడుకు సోమవారం మంత్రి నిమ్మల రామానాయుడు సారధ్యంలో పాలకొల్లు నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఎక్కడికక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు బస్సులు, కార్లలో బయలుదేరి వెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి మహానాడు కావడంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. మంత్రి అదేశాలతో స్థానిక నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కడప మహానాడుపై వైసీపీకి భయం ఎందుకు?'

తిక్కారెడ్డి కడపలో మహానాడు నిర్వహించడంపై వైసీపీ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం అర్ధరహితం అని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. సోమవారం కర్నూలులో మాట్లాడుతూ మహానాడు వేడుకలు గత 40 ఏళ్లుగా చేస్తున్నామని, మే 27-29 తేదీలలో జరుగుతుండగా ఈసారి కడపను వేదికగా ఎంచుకున్నామని, ఏ రాజకీయ దురుద్దేశం లేదన్నారు. కడప కూడా రాష్ట్రంలో భాగమేనని వైసీపీనేతలు గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.

Tags

Next Story