జగన్ ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం

జగన్ ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం
ప్రచారంలో భాగంగా జగన్‌ ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టిడిపి దూకుడు పెంచింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొలుత సుగురు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన.. అనంతరం అభ్యర్థులతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు.

ప్రచారంలో భాగంగా జగన్‌ ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధిపై వైసీపీ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

వైసీపీ నేతల బెదరింపులకు హిందూపురంలో ఎవ్వరూ భయపడరని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయంలో హిందూపురంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసామన్న బాలకృష్ణ.. మున్సిపల్ ఎన్నికల్లోను టిడిపిని గెలిపించాలని ఓటర్లను కోరారు.

Tags

Read MoreRead Less
Next Story