జోగి రమేష్ కు బండారు స్ట్రాంగ్ కౌంటర్

మంత్రి జోగి రమేష్ కు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి కౌంటర్ ఇచ్చారు. సొంత చిన్నాన్నను చంపితే వైఎస్ ఆత్మక్షోభించిందా..? అని ప్రశ్నించారు. జగనుకు కూడా వైఎస్ వివేకా హత్యలో పాత్ర ఉందని సీబీఐ చెప్పలేదా అన్నారు. పదవి నుంచి దింపడమే తప్పైతే.. సొంత చిన్నాన్నను చంపిన వారిని ఏమనాలన్నారు. దీనికి జోగి రమేష్ ఏం సమాధానం చెబుతారని విమర్శించారు.
వివేకా హత్య విషయంలో జగన్ వైఎస్ సమాధి వద్దకెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్నాన్నను చంపిన దుర్మార్గుడు జగన్, నిరుద్యోగులను మోసం చేశారు.. ఇదేనా మేనిఫెస్టోని అమలు చేయడమంటే ఇదేనా అని విమర్శించారు.
ప్రత్యేక హోదా తెస్తానన్నారు.. ఏమైంది, పేదలకు ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో పెట్టారే.. ఆ ఇళ్లు ఏమయ్యాయన్నారు.
మహానాడు జరుగుతోంటే ఓర్వలేక జోగి రమేషును ఉసిగొల్పారన్నారు. బీసీ అయిన జోగి రమేష్ గౌరవంగా బతకాలని సూచించారు. జోగి రమేష్ జగన్ వద్ద బంట్రోతు ఉద్యోగం చేయొద్దని, మహానాడుకు.. చంద్రబాబుకు జోగి రమేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com