ఏపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం : చంద్రబాబు

పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రభుత్వం, ఎన్నికల సంఘంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని.. ఎస్ఈసీ ఓ రబ్బర్ స్టాంప్.. సీఎం ఏం చెబితే అది చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. బాధాకరమే అయినా ఎన్నికల బహిష్కరణ తప్పడం లేదని.. బహిష్కరణ తప్ప మరో మార్గం లేదని చంద్రబాబు అన్నారు.
టీడీపీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థుల్లో బాధ, ఆవేదన ఉందని.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ప్రజలు ఈ రౌడీ పాలిటిక్స్ను అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికలంటే టీడీపీకి కొత్త కాదని.. రౌడీలతో, పోలీసులతో, అవినీతితో పోరాడడం మాత్రమే కొత్తని ఆయన అన్నారు. నచ్చినవారిని ప్రజలు ఎన్నుకునే పరిస్థితి లేకపోవడం దారుణం అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com