Kurnool District: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

X
By - Prasanna |10 July 2025 11:27 AM IST
హైదరాబాద్ నుండి కడప జిల్లా మైదుకూరు వెళ్తున్న వ్యాను ట్రాక్టర్ను ఢీకొన్న ఘటనలో కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మరణించారు.
హైదరాబాద్ నుండి కడప జిల్లా మైదుకూరు వెళ్తున్న వ్యాను ట్రాక్టర్ను ఢీకొన్న ఘటనలో కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఓర్వకల్లు మండలం కల్వబుగ్గలోని కాసిరెడ్డినాయన ఆశ్రమం సమీపంలో ఈ ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బాధితుల్లో మున్నీ (35), షేక్ కమల్ బాషా (50) ఉన్నారు. వారు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్ల షేక్ నదియా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
మృతులతో పాటు, మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి వైద్య సహాయం అందుతోంది. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com