Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు కేంద్రం రిటర్న్ గిఫ్ట్.. పిఠాపురానికి నాలుగు రైళ్లు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు కేంద్రం రిటర్న్ గిఫ్ట్.. పిఠాపురానికి నాలుగు రైళ్లు
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ కు, ఏపీ ప్రభుత్వానికి ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం తీపి కబురు అందించనుంది. పిఠాపురంలో నియోజక అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పిఠాపురం మీదుగా నాలుగు ట్రైన్లను నడిచేలా కేంద్ర రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నాలుగు ట్రైన్లకు పిఠాపురంలో హాల్టింగ్ ఇవ్వాలని కోరగా.. అందుకు కేంద్ర రైల్వే మంత్రి ఓకే చెప్పారు. అందులో నాందేడ్ -సంబల్పూర్ నాగవళి ఎక్స్ ప్రెస్, నాందేడ్ -విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, విశాఖపట్నం- సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్, ఏపీ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. అదేవిధంగా లాతూరు నుంచి తిరుపతికి రైలు సర్వీస్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్ మంత్రిని పవన్ కోరినట్లు సమాచారం. దీనిపై కూడా త్వరలోనే సానుకూల స్పందన రానున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story