పరిషత్‌ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం

పరిషత్‌ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం
పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో బీజేపీ వేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువడే అవకాశం ఉంది.

పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో బీజేపీ వేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువడే అవకాశం ఉంది. అటు.. ఎస్‌ఈసీ తరఫున కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత హైకోర్టు విచారణ చేపట్టనుంది. అనంతరం తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే.. మరోపక్క జనసేన దాఖలు చేసిన పిటిషన్‌ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీనికి తోడు మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story