CM Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు (జూలై 15, మంగళవారం) ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆయన షెడ్యూల్ ఇలా ఉంది. ఉదయం 11:45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం 1:00 గంటకు: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 2:30 గంటలకు నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సరస్వత్ తో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 3:00 గంటలకు: ఢిల్లీ మెట్రో ఎండీతో సమావేశం (రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చ). అవుతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు మూర్తి మార్గ్-3లో జరిగే పీవీ నర్సింహారావు సంస్మరణ సభలో ప్రసంగిస్తారు. రాత్రి 7:00 గంటలకు: కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశం.అవుతారు. ఈ రెండు రోజుల పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ బకాయిలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. జూలై 16న కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్ బాయ్ ఎల్. మాండవియా, సీ.ఆర్. పాటిల్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ భేటీ కానున్నారు. జూలై 17న ఉదయం 9:30 గంటలకు ఢిల్లీ నుంచి అమరావతికి తిరిగి వస్తారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com