Chittoor: స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు..

Chittoor: స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు..
Chittoor: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్వర్ణముఖి నదిలో ఈతకని వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.

Chittoor: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్వర్ణముఖి నదిలో ఈతకని వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. నీటిలో కొట్టుకుపోతుండగా ఒకరిని స్థానికులు కాపాడారు. ఈ ఘటన రేణిగుంట మండలం జీ.పాళ్యం గ్రామంలో చోటుచేసుకుంది. గల్లంతైన గణేష్‌, ధోనీ, యుగంధర్‌ కోసం గాలింపు చేపట్టారు గజ ఈతగాళ్లు. నిక్షిత్‌ అనే విద్యార్థిని స్థానికులు రక్షించారు. పిల్లల ఆచూకి తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story