కుప్పంలో టీడీపీ బ్యానర్లను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

X
By - Nagesh Swarna |25 March 2021 12:29 PM IST
బ్యానర్లను తగలబెట్టడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లను దుండగలు తగలబెట్టడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యానర్లు కాల్చిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com