Rajasthan : రాజస్థాన్ కు తాకిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం

X
By - Manikanta |23 Sept 2024 10:45 AM IST
తిరుమల దేవదేవుడి లడ్డు వ్యవహారం రాజస్థాన్ కు తాకింది. వేంకటేశ్వరస్వామి ఆలయంలోని ప్రసాదంలో కల్తీపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని పెద్ద దేవాలయాల ప్రసాదాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పెద్ద ఆలయాల్లోని కానుకలను భజన్లాల్ ప్రభుత్వం పరిశీలించాలని నిర్ణయించింది. ఆలయాల కానుకలపై విచారణకు ఆదేశించింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విచారణ సెప్టెంబర్ 23 నుంచి 26వ తేదీలోపు పూర్తి కావాల్సి ఉంది. 14 ఆలయాలకు సర్టిఫికెట్లు ఉన్నట్లు సమాచారం. అయినా కూడా ఆర్డర్ తర్వాత, పెద్ద దేవాలయాలలో ప్రసాదాలను తనిఖీ చేసే ప్రచారం ప్రారంభించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com