తిరుమల వేసవి రద్దీ.. సర్వ దర్శనానికి 30 గంటల సమయం

రానున్న రోజుల్లో రద్దీ తారాస్థాయికి చేరే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వేసవి సెలవులు, పరీక్షల ఫలితాల కారణంగా తిరుమల ఆలయంలో రద్దీ పెరిగింది. కాంప్లెక్సులు నిండిపోవడంతో 4 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించింది. వైకుంటం క్యూ కాంప్లెక్సులు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ నారాయణగిరి తోటలకు చేరుకుంది.
టోకెన్లు లేకుండా క్యూలో ఉన్న భక్తులు శ్రీవారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో రద్దీ తారాస్థాయికి చేరే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో గురువారం గంటకు పైగా వర్షం కురవడంతో భక్తులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. బుధవారం దాదాపు 79,207 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. టిటిడి కార్యనిర్వహణాధికారి ఎవి ధర్మారెడ్డి ఇతర ఉన్నతాధికారులు ఆలయ సిబ్బంది క్యూలో ఉన్న భక్తులకు ఆహారం, నీరు ఇతర నిత్యావసరాలను సరఫరా చేసేలా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com