AP : టమాట కేజీ రూ.8... ఎక్కడో తెలుసా?

X
By - Manikanta |14 Dec 2024 5:45 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా కిలో రూపాయికి ధర పడిపోయిందనే కథనాలపై మంత్రి అచ్చెన్నాయుడు చర్యలు చేపట్టారు. లాభ నష్టాలు లేకుండా కిలో టమా టా రూ.8కి కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో అదే ధరకు విక్రయించాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి, తక్కువ ధరకు వర్షాధార నాసిరకం టమాటా మార్కెట్లో అందుబాటులో ఉండడంతో సాధారణ టమాటా ధరపై ప్రభావం పడిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అటు రైతులకు ఇటు వినియోగదారు లకు మేలు జరిగే విధంగా మార్కెటింగ్ శాఖ టమాటా కొనుగోళ్లు విక్రయాలు చేపట్టాలని అధి కారులను ఆదేశించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com