2021-22 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం : వైవీ సుబ్బారెడ్డి

2021-22 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం : వైవీ సుబ్బారెడ్డి
2021-22 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది టీటీడీ. 2 వేల 937 కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌ను ఆమోదించింది టీటీడీ. ఇక ఉగాది నుంచి భక్తులకు ఆర్జిత సేవలు ప్రారంభించనున్నారు.

2021-22 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది టీటీడీ. 2 వేల 937 కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌ను ఆమోదించింది టీటీడీ. ఇక ఉగాది నుంచి భక్తులకు ఆర్జిత సేవలు ప్రారంభించనున్నారు. దీంతో పాటు టీటీడీ పరిధిలోకి మరికొన్ని ఆలయాలు తీసుకురావాలని నిర్ణయించారు. ఇక.. టీటీడీ కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ తులాభారాన్ని ప్రారంభించనున్నారు.

బర్డ్ హాస్పిటల్స్‌లో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటు కోసం 9 కోట్ల రూపాయలను కేటాయించారు. టీటీడీ పరిధిలోని వేదవిజ్ఞాన పీఠం పరిధిలోకి వేదపాఠశాలు అన్నింటిని తీసుకువస్తామన్నారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు విద్యుత్ వినియోగాన్నినియంత్రించడంతో పాటు గ్రీన్ పవర్‌ని వినియోగంలోకి తీసుకువస్తామన్నారు.

ముంబై, జమ్మూ‌లో శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది టీటీడీ. అలాగే అయోధ్యలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి వీలుగా స్థలాన్ని కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని కోరుతామని పాలక మండలి ప్రకటించింది. తిరుమల ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పాలకమండలి నిర్ణయించింది.

శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించింది. గో మాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తీర్మానించింది. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనుంది.

Tags

Read MoreRead Less
Next Story