TTD: తిరుమల కొండపైన ఆహార విక్రయ కేంద్రాలపై టీటీడీ వేటు..

X
By - Divya Reddy |18 Feb 2022 4:09 PM IST
TTD: తిరుమలలో TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పలు ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
TTD: తిరుమలలో TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పలు ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొండపైన ప్రైవేటు హాటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలను తొలగించి.. భక్తులందరికీ ఉచితంగా ప్రసాదాన్ని అందజేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు చేయడం వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తుంది. బోర్డు తీర్మానం ప్రకారం వచ్చే రోజుల్లో కొండపైన ఆహార విక్రయ కేంద్రాలను పూర్తిగా తొలిగించి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందజేస్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి త్వరలో ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com