ఒకటే గ్రామం... కానీ రాష్ట్రాలు మాత్రం రెండు!

X
By - TV5 Digital Team |21 Feb 2021 12:30 PM IST
ఆ గ్రామంలో రహదారికి ఇరువైపులా వంద మంది చొప్పున దాదాపు 200 మంది జనాభా ఉంటారు. సగభాగం ఏపీ లోనూ.. మరో సగం తెలంగాణ లోనూ కొనసాగుతోంది.
ఆ గ్రామంలో రహదారికి ఇరువైపులా వంద మంది చొప్పున దాదాపు 200 మంది జనాభా ఉంటారు. సగభాగం ఏపీ లోనూ.. మరో సగం తెలంగాణ లోనూ కొనసాగుతోంది. ఆ గ్రామమే.. సత్యనారాయణపురం. ఊరిలోని ప్రధాన రహదారి అరకిలోమీటరు ఉండగా.. ఇందులో సగం(70ఓట్లు) కృష్ణా జిల్లా విస్సన్నపేట(మం) కొర్లమండ పంచాయతీ పరిధిలోకి.. మరోసగం(మరో 70ఓట్లు) ఖమ్మం జిల్లా వేంసూరు(మం) అమ్మపాలెం పంచాయతీ పరిధిలోకి వస్తాయి. గ్రామం పేరొకటే.. కానీ రాష్ట్రాలు మాత్రం రెండు. కాగా... తెలంగాణ పరిధిలో రాష్ట్ర మంత్రి టి.హరీశ్రావు ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com