Vishakapatnam: జీవీఎంసీ ఎదుట టీడీపీ నిరసన

Vishakapatnam:  జీవీఎంసీ ఎదుట టీడీపీ నిరసన
జీ20 సమ్మిట్‌ కోసం తొలగించిన చిరు వ్యాపారులకు నష్ట పరిహారం చెల్లించాలి

విశాఖలో తోపుడు బళ్లు, చిరు వ్యాపారులను ఖాళీ చేయిస్తున్నారు. జీ20 సమ్మిట్‌ ఏర్పాట్ల పేరుతో పేదలను రోడ్డుపైకి నెడుతున్నారని టీడీపీ బుధవారం ఆందోళనకు దిగింది. అధికారుల తీరుతో వందలాది మంది ఉపాధి కోల్పోతున్నారని టీడీపీ నేతలు తెలుపుతున్నారు. వీరికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదంటూ జీవీఎంసీ ఎదుట టీడీపీ నిరసన చేపట్టింది. తమ ప్రభుత్వ హయాంలో ప్లీట్‌ రివ్యూ సందర్భంగా మత్స్యకారులకు నష్ట పరిహారం ఇచ్చామని టీడీపీ నేతలు గుర్తు చేశారు. జీ20 సమ్మిట్‌ కోసం తొలగించిన చిరు వ్యాపారులకు నష్ట పరిహారం చెల్లించాలనీ టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story