vishaka: విధ్వంసం నుంచి వికాసం దిశగా విశాఖ

ప్రకృతి వనరులకు విశాఖపట్నం ఆలవాలం. ఈ తీర నగరాన్ని దేశ ఆర్థిక రాజధాని ముంబైకు దీటుగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అందుకే అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు వైజాగ్ను వేదికగా ఎంచుకుంటోంది. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ యోగ దినోత్సవానికి విశాఖనే కేంద్రంగా చేసుకున్నారు. దీంతో మరోసారి అంతర్జాతీయ వేదికపై విశాఖ పేరు మార్మోగుతోంది.ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న నగరం విశాఖ.
ప్రత్యేక దృష్టి...
జగన్ 5 ఏళ్ళ పాలనలో ఓసారి మూడు రాజధానులని మరోసారి విశాఖ రాజధాని అంటూ రకరకాల ప్రకటనలు చేశారు. కానీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విశాఖలో పర్యటించి నగరాభివృద్ధిపై జిల్లా అధికారులతో చర్చించి, ప్రణాళికలు సిద్దం చేశారు. విశాఖ నగరానికి అతి సమీపంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్య భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను వేగవంతం చేశారు. విమానాశ్రయ సౌకర్యాలు కల్పించేందుకు మరో 500 ఎకరాలు కేటాయించారు. 2026 ఏప్రిల్ నాటికల్లా అక్కడి నుంచి విమాన సేవలు మొదలవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని రేయింబవళ్ళు పనులు జరుగుతున్నాయి. ఓ పక్క చకచకా విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతుంటే మరోపక్క దానిని కలుపుతూ 15 ప్రధాన రహదారులు నిర్మిస్తున్నారు.
విశాఖ.. బృహత్తర ప్రణాళిక
రహదారులుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖ మెట్రో నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు కూడా ముహూర్తం ఖరారు చేసేశారు. అక్టోబర్ నుంచి పనులు మొదలుపెట్టి మూడేళ్ళలోగా పూర్తిచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా వాహనాలు, మెట్రో రైళ్ళు ప్రయాణించేలా డబుల్ డెక్కర్ ఎలివేటడ్ మెట్రో కారిడార్ నిర్మించబోతున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎకనామిక్ హబ్ అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు రిపోర్ట్ తయారైందన్నారు. కాకినాడ పోర్టు నుంచి మూలపేట పోర్టు వరకూ గల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే బెస్ట్ ఎకమినామిక్ కారిడార్గా నిలుస్తుందన్నారు. ప్రపంచంలోని డేటాను విశాఖకు తెచ్చి ఏఐ సాయంతో విశ్లేషించనున్నట్టు తెలిపారు. ఇందుకు సింగపూర్ నుంచి విశాఖకు సముద్ర మార్గంలో కేబుల్ వేయనున్నట్టు చంద్రబాబునాయుడు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్ప్లాంటు వస్తోందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com