Visakhapatnam: పెళ్లిరోజే విషాదం.. ఆర్కే బీచ్‌లో గల్లంతయిన వివాహిత..

Visakhapatnam: పెళ్లిరోజే విషాదం.. ఆర్కే బీచ్‌లో గల్లంతయిన వివాహిత..
Visakhapatnam:NADకి చెందిన భార్యభర్తలు ఆర్.పి.రెడ్డి, సాయిప్రియ పెళ్లిరోజు సందర్భంగా నిన్న సాయంత్రం ఆర్కే బీచ్‌ వెళ్లారు

Visakhapatnam: విశాఖ ఆర్కే బీచ్‌లో వివాహిత గల్లంతైంది. NADకి చెందిన భార్యభర్తలు ఆర్.పి.రెడ్డి, సాయిప్రియ పెళ్లిరోజు సందర్భంగా నిన్న సాయంత్రం ఆర్కే బీచ్‌ వెళ్లారు. భార్యాభర్తలిద్దరూ సాయంత్రం 6 గంటలకు బీచ్ ఒడ్డునే ఉన్నారు. ఇంతలో మెసేజ్ రావడంతో ఫోన్ చూసుకుంటూ ఉండిపోయాడు ఆర్‌.పి.రెడ్డి. ఆ తరువాత బీచ్‌ దగ్గర చూస్తే.. సాయిప్రియ కనిపించలేదు. బీచ్‌లో చుట్టుపక్కల వాళ్లని అడిగినా.. ఎవరికీ తెలియదని చెప్పడంతో కెరటాల్లో కొట్టుకుపోయిందని అనుమానించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సాయిప్రియ కోసం నేవీ అధికారులు హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story