Chandrababu : చంద్రబాబుకు మహిళా కమిషన్‌ ఇచ్చిన నోటీసులో తప్పు

Chandrababu (tv5news.in)

Chandrababu (tv5news.in)

Chandrababu : తప్పులు చేయడం ఆ తర్వాత నాలుక కరచుకోవడం ఏపీలో అధికారులకు పరిపాటిగా మారిపోయింది.

Chandrababu : తప్పులు చేయడం ఆ తర్వాత నాలుక కరచుకోవడం ఏపీలో అధికారులకు పరిపాటిగా మారిపోయింది. విజయవాడ ఆస్పత్రిలో వాసిరెడ్డి పద్మను అవమానించారంటూ… టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ మహిళ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ సూచించింది. అయితే ఇందులో విచారణ తేదీని తప్పుగా ప్రచురించింది. మొదటి పేరాలో ఈ నెల 27 వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ చెప్పిన మహిళా కమిషన్‌... చివర్లో ఉత్తర్వుల కాలమ్‌ లో మాత్రం ఆ తేదీని నవంబర్‌ 27 గా తెలిపింది. ఇంతకీ అసలు ఈ విచారణ ఎప్పుడు జరుగుతుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదటి పేరాలో ఉన్న తేదీ తప్పా… లేక చివరి పేరాలో ఉన్న తేదీ తప్పా అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

అత్యాచారానికి గురైన మానసిక వికలాంగురాలిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. అదే సమయంలో మహిళ కమిషన్‌ చైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కూడా అక్కడికి వచ్చారు. రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ, వాసిరెడ్డి పద్మకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాసిరెడ్డి పద్మను చంద్రబాబుతో పాటు టీడీపీ నేత బోండా ఉమ పరుష పదజాలంతో దూషించారని.. తప్పుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మహిళా కమిషన్‌ వారికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇందులో విచారణ తేదీని తప్పుగా ప్రచురించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story