YCP: వైఛీపీ సైకో కాకులు.. ఉమామహేశ్వరి మృతిపై అబద్ధపు రాతలు..

YCP: వైఛీపీ సైకో కాకులు.. ఉమామహేశ్వరి మృతిపై అబద్ధపు రాతలు..
YCP: నారా లోకేష్, ఉమామహేశ్వరి మధ్య వివాదం చెలరేగిందని వైసీపీ సోషల్ సైకోలు రాసుకువచ్చారు.

YCP: రక్తపు చరిత్రలు.. విషపు రాతలు.. దరిద్రపుగొట్టు ఆలోచనలు. ఛీ వీళ్లది ఓ బతుకేనా.. దుష్టపన్నాగాలు పన్నడం.. దుష్ర్పచారాలు చేయడం. అది వైసీపీనా.. వైఛీపీనా.. ఇంటి మనిషి చనిపోయి పుట్టుడు దుఃఖంలో ఉన్న కుటుంబంపై నిందలు వేసే వెర్రితానాన్ని ఇంకేమనలి. అసలు వాళ్లు మనుషులేనా.. కట్టుకథలతో కాకుల్లా పొడిచే యత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడానికి నారా లోకేష్ కారణమని సోషల్ మీడియాలో కొన్ని కుక్కలు మోరుగుతున్నాయి. పనికి రాని, దరిద్రపుగొట్టు రాతలు రాసి, రాక్షస రాబంధులు శునకానందం పొందుతున్నాయి.


జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్ 45లో నోటికి వచ్చిన సర్వే నంబర్లను రాసి ఆరు ఎకరాల 73 సెంట్ల భూమి కోసం నారా లోకేష్, ఉమామహేశ్వరి మధ్య వివాదం చెలరేగిందని వైసీపీ సోషల్ సైకోలు రాసుకువచ్చారు. రాత్రికే రాత్రే భూతగాదాలు అనే కట్టుకథని అల్లి రాక్షస ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అసలు జూబ్లీహిల్స్ లో ఆరెకరాల ఖాళీ స్థలం ఎక్కడ ఉందనే ఆ దిక్కుమాలిన వైసీపీ బుర్రలకు తట్టలేదా.. జూబ్లీహిల్స్ పరిధిలో 273, 274, 275, 276 సర్వే నంబర్లు లేనేలేవనే చిన్న విషయాన్ని ఆ విషపు రాతలు ఎందుకు విస్మరించాయి.

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో సర్వేనెంబర్ 273, 274, 275 ,276 లేదని షేక్పేట్ తాసిల్దార్ రామకృష్ణ తెలిపారు . ఇక్కడ సర్వేనెంబర్ 403 పార్ట్ 2 వస్తుందని తాసిల్దార్ చెప్పారు .షేక్పేట్ మండల పరిధిలో ఇలాంటి సర్వే నెంబరు లేవని ఆయన పేర్కొన్నారు. 10 నిమిషాల క్రితం ఇదే సర్వే నెంబర్ల మీద సాక్షి విలేకరులు కూడా ఆరా తీసినట్టు ఆయన చెప్పారు.



వైసీపీకి శవరాజకీయాలు చేయడం కొత్తేమి కాదు. వైఎస్ వివేకా హత్యకోణంలో జరిగిన పరిణామాలు తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలియనివా. వైఛీపీ నాయకుల దుష్టపన్నాగాలు తెలుగు ప్రజలు ఎరుగనివా.. వికృత ఆనందం కోసం విషపు రాతలు రాసి ఏం మూటగట్టుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ మానవత్వాన్ని మించిన కిరీటం లేదు. మంచితనాన్ని మించిన పదవులు లేవు. కానీ ఇలాంటి సైకో కాకులు ఎంత పొడిచినా.. ఎరిగేదేమి లేదు. తెలుగుదేశం పార్టీకి పోయేది ఏమీ లేదు.



Tags

Read MoreRead Less
Next Story