Badvel Bypoll: బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం
Badvel Bypoll: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. పార్టీ అభ్యర్ధి డాక్టర్ దాసరి సుధా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఓట్లలెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యాన్ని కనబరిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వైసీపీని అందుకోనంత వెనుకబడిపోయాయి. ప్రతి రౌండ్లో వైసీపీ అభ్యర్ధి దాసరి సుధ ఆధిక్యం స్పష్టంగా కనబరిచారు. మొత్తం లక్షా పదివేలకు పైగా ఓట్లు రాగా..పోలైన ఓట్లలో 90 వేలకు పైగా భారీ మెజార్టీ సాధించారు.
బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఈ ఉదయం 8గంటలకు బాలయోగి గురుకుల పాఠశాలలో ప్రారంభమైంది. ఇందుకుగాను 281 పోలింగ్ కేంద్రాలకు ఒకే చోట కౌంటింగ్ నిర్వహించారు. నాలుగు హాళ్లలో 28 టేబుల్స్ ఏర్పాటు చేసి ఈవీఎంలోని ఓట్లను లెక్కించారు. మొదటి ఒకటి, రెండు రౌండ్లలోనే ఓ క్లారిటీ వచ్చింది. వైసీపీ అభ్యర్ధి అధిక్యతను కనబరిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా డీలాపడింది. బద్వేల్లో మొత్తం 2లక్షల15 వేల ఓట్లు ఉండగా.. ఈఎన్నికల్లో 1లక్షా 46వేల ఓట్లుపోలయ్యాయి. ఇందులో వైసీపీ పార్టీ భారీ స్థాయిలో ఓట్లను కైవసం చేసుకుంది.
గత ఎన్నికల్లో 1లక్షా 58వేల ఓట్లుపోలైతే.. అందులో 60శాతం ఓట్లు వైసీపీకివచ్చాయి. అయితే ఈ సారి గతంలోకంటే అత్యధిక ఓట్లను వైసీపిసాధించింది. ఏకంగా 80 శాతంగానికి పైగా ఓట్లు సొంతం చేసుకుంది. ఈసారి కూడా కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2019 లో ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక జరిగింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com