వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసన సెగ

X
By - Bhoopathi |20 Jun 2023 2:00 PM IST
గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల ముందుకు వస్తున్న మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలను వీధిలోనే నిలబెట్టి కడిగేస్తున్నారు.
ఏపీలో ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు జనం. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల ముందుకు వస్తున్న మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలను వీధిలోనే నిలబెట్టి కడిగేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీని అడ్డుకొని నిలదీశారు రావికవతం మండలం చీమలపాడు గిరిజనులు. పథకాలు వద్దని తమ పిల్లల భవిష్యత్తు ముఖ్యమంటూ ఆందోళన చేశారు.నాలుగేళ్లుగా తమ సమస్యలను పరిష్కరించలేదని మండిపడ్డారు.కళ్యాణపులోవ రిజర్వాయర్ పై మైనింగ్ లీజు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సరైన రహదారు లేక డోలి కట్టుకొని తీసుకెళ్లే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రతి సంవత్సరం విడుదల చేస్తామన్న జాబ్ కేలండర్ ఎక్కడని నిలదీశారు. అలాగే ఆదివాసి చిన్నారుల ప్రత్యేక స్కూల్స్ ఏర్పాటు చేయలేదని ఫైర్ అయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com