YCP: రూ.15 కోట్ల భూమిని కబ్జా చేసిన వైసీపీ నేత!

YCP: రూ.15 కోట్ల భూమిని కబ్జా చేసిన వైసీపీ నేత!
X

గుం­త­క­ల్లు­లో ప్ర­భు­త్వ భూ­ము­ల­ను అక్ర­మం­గా ఆక్ర­మిం­చి దు­కా­ణా­లు ని­ర్మిం­చి అద్దె­కు ఇచ్చిన వై­సీ­పీ నా­య­కు­డి దందా బట్ట­బ­య­లైం­ది. హను­మా­న్‌ సర్కి­ల్‌ వద్ద ఉన్న వి­లు­వైన ప్ర­భు­త్వ భూ­మి­పై వై­సీ­పీ నేత దే­వేం­ద్ర­ప్ప తన కు­టుంబ సభ్యుల పే­ర్ల­తో నకి­లీ ఇళ్ల పట్టా­లు సృ­ష్టిం­చా­డు. సర్వే నం­బ­ర్లు 424-బి, 421-2లో కలి­పి 54 సెం­ట్ల భూ­మి­లో 30 సెం­ట్ల­పై షె­డ్లు ని­ర్మిం­చి 17 దు­కా­ణా­లు ఏర్పా­టు చే­శా­డు. ఒక్క దు­కా­ణా­ని­కి నె­ల­కు రూ.25 వేలు అద్దె వసూ­లు చే­స్తుం­డ­గా, ఆ స్థల మా­ర్కె­ట్‌ వి­లువ రూ.15 కో­ట్ల­కు పై­గా­నే ఉం­డ­వ­చ్చ­ని స్థా­ని­కు­లు చె­బు­తు­న్నా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం వచ్చిన తర్వాత మాజీ కౌ­న్సి­ల­ర్‌ కె.రా­మ­చం­ద్ర ఫి­ర్యా­దు చే­య­డం­తో కలె­క్ట­ర్‌ వి­నో­ద్‌­కు­మా­ర్‌ ఆదే­శా­ల­పై సర్వే జరి­పిన తహ­సీ­ల్దా­ర్‌ ని­వే­ది­క­లో అక్రమ ని­ర్మా­ణా­లు స్ప­ష్ట­మ­య్యా­యి. అయి­తే రా­జ­కీయ ఒత్తి­ళ్ల­తో మరో ని­వే­ది­క­లో ఆక్ర­మణ కే­వ­లం 12.75 సెం­ట్లే అని చూ­పిం­చా­రు. దాం­తో పాటు ప్ర­జా­ప్ర­తి­ని­ధి అను­చ­రు­ల­కు వాటా ఇవ్వా­ల­న్న ఒప్పం­దం కు­ది­రి­న­ట్టు ఆరో­ప­ణ­లు వి­ని­పి­స్తు­న్నా­యి. కలె­క్ట­ర్‌ స్పం­ది­స్తూ, వి­చా­రణ జరి­పి తగిన చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని తె­లి­పా­రు. ఈ వ్య­వ­హా­రం­పై ప్ర­జ­ల్లో ఆగ్ర­హం నె­ల­కొం­ది. ప్ర­భు­త్వ భూ­ము­లు కొం­ద­రి హస్తా­ల్లో­కి వె­ళ్లి­పో­తుం­డ­టం బా­ధా­క­ర­మ­ని స్థా­ని­కు­లు ఆవే­దన వ్య­క్తం చే­స్తు­న్నా­రు.

Tags

Next Story