SHARMILa: "జగన్ ర్యాలీలపై నిషేధం విధించాలి"

వైఎస్ జగన్ చేసే ర్యాలీలు, బల ప్రదర్శనలను నిషేధించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పోలీసుల సూచనలను పాటించకుండా జగన్ తప్పు చేశారన్నారు. ఇటీవల పల్నాడులో జగన్తో కరచాలనం చేసేందుకు వచ్చి ఓ వృద్ధుడు కారు కింద పడ్డాడని.. అయినా డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లారని ఆమె మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా పక్కకు లాగి ర్యాలీగా వెళ్లారన్నారు. సొంత పార్టీ కార్యకర్తపైనా మానవత్వం లేకుండా వ్యవహరించారంటూ షర్మిల ఆక్షేపించారు.
హోంమంత్రి వార్నింగ్
వైసీపీ మూకలు మరోసారి రప్పా రప్పా అంటే ప్రజలే తిరగబడేలా ఉన్నారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. జగన్, ఆయన బ్యాచ్ ఆటలు ఇక సాగవని స్పష్టం చేశారు. పల్నాడు పర్యటనలో జగన్ ముగ్గురి ప్రాణాలు తీశారంటూ మండిపడ్డారు. అంబులెన్స్ సైరన్ వినిపిస్తే పిల్లలు కూడా పక్కకు తప్పుకొంటారని.. జగన్ ప్రచార పిచ్చి వల్లే మధు అనే యువకుడి ప్రాణం పోయిందన్నారు. వైసీపీ కుట్రల పట్ల ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యత తమపై ఉందని తెలిపారు. ఎక్కడ, ఎవరు చనిపోతారా?అని ఎదురుచూసే జగన్ స్వభావం అర్థమవుతోందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com